Telugu Global
Telangana

దేశ పునర్నిర్మాణంలో కేసీఆర్ కీలకం - అఖిలేష్ యాదవ్

"భారత రాష్ట్ర సమితి, SP రెండూ దేశ పునర్నిర్మాణం, బిజెపి అవినీతి, మతతత్వ పాలనను తొలగించే పనిలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి" అని అఖిలేష్ యాదవ్ నొక్కిచెప్పారు.

దేశ పునర్నిర్మాణంలో కేసీఆర్ కీలకం - అఖిలేష్ యాదవ్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వామపక్షాలు సహా పలువురు నేతలు స్పష్టమైన ఎజెండాతో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పనిచేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

"భారత రాష్ట్ర సమితి, SP రెండూ దేశ పునర్నిర్మాణం, బిజెపి అవినీతి, మతతత్వ పాలనను తొలగించే పనిలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి" అని అఖిలేష్ యాదవ్ నొక్కిచెప్పారు.

ఖమ్మంలో ఈ రోజు జ‌రగనున్న బీఆరెస్ బహిరంగసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....

''భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) సరైన తరుణంలో జాతీయ పాత్రను చేపట్టాలని నిర్ణయించుకుంది, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇదే కోరుకుంటున్నాయి. బిజెపి, దాని ప్రభుత్వం, సంఘ్ పరివార్‌లోని దాని సహచరులు దేశాన్ని అన్ని విధాలుగా.. సామాజికంగా, పరిపాలనా,ఆర్థికంగా నాశనం చేస్తున్నారు. ఒకవైపు మతపరమైన విభజన వాదం, మరొక వైపు వినాశకరమైన ఆర్థిక విధానాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడం... సరైన దిశానిర్దేశం లేకుండా పరిపాలన సాగుతోంది. దేశం, ప్రజల సమస్య‌లను పరిష్కరించడంలో కేసీఆర్ వంటి నాయకులు, BRS వంటి పార్టీలు లోతైన, స్థిరమైన పాత్ర పోషించాల్సిన సమయం ఇదేననడంలో సందేహం లేదు.'' అని అన్నారు.

''దేశ పునర్నిర్మాణం, బిజెపి అవినీతి, మతతత్వ పాలనను తొలగించే ఈ పనిలో BRS,సమాజ్‌వాదీ పార్టీ రెండూ అద్భుతమైన పాత్ర పోషిస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. 2024 ఎన్నికలలోపు మూడో ఫ్రంట్ ఏర్పడుతుంది. సమిష్టి కృషి ద్వారా బీజేపీ దుష్ట శక్తులు ఓడిపోతాయనడంలో సందేహం లేదు. మేమందరం దానిపై పని చేస్తున్నాము. BRS ఇందులో చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. నా దృష్టిలో కేసీఆర్ చాలా కీలకమైన నాయకులు.'' అని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.

''బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టేందుకు దేశంలోని సామాన్య ప్రజానీకం మనకంటే ఎక్కువ తహతహలాడుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, ప్రతి రంగంలో అభివృద్ధి శూన్యం అంటూ విసిగిపోయారు. మనం కేవలం ప్రజలకు చేరువ కావాలి. వారి నమ్మకాన్ని పొందాలి. మా సమిష్టి కృషి ఈ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.'' అఖిలేష్ పేర్కొన్నారు.

First Published:  18 Jan 2023 1:27 AM GMT
Next Story