Telugu Global
Telangana

అంబేడ్కర్ బాటలో కేసీఆర్....ధన్యవాద సభలో జాతీయ మేధావులు

ప్రబుద్ధ బారత్‌ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం నిర్వహించిన ఈ ధన్యవాద సభకు యూజీసీ మాజీ చైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌, మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు హాజరయ్యారు.

అంబేడ్కర్ బాటలో కేసీఆర్....ధన్యవాద సభలో జాతీయ మేధావులు
X

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి, తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్‌ పేరుపెట్టడం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుచేయడం తదితర కార్యక్ర‌మాల పట్ల అనేక మంది జాతీయ స్థాయి మేదావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు రవీంద్రభారతిలో మంగళవారం ధన్యవాద సభ నిర్వహించారు.

ప్రబుద్ధ బారత్‌ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం నిర్వహించిన ఈ ధన్యవాద సభకు యూజీసీ మాజీ చైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌, మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టడం కేసీఆర్ గొప్ప దార్శనికతకు నిదర్శనమని అన్నారు. నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించేందుకు మోడీ సర్కార్‌ యత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి కొనియాడారు.

అంబేద్కర్ దూరదృష్టి చాలా గొప్పదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్ అన్నారు. ఆయన రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కాకపోయేదని అభిప్రాయపడ్డారు.

అంబేడ్కర్ బాటలో కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసీ విజ్ఞులత పేర్కొన్నారు.

First Published:  4 April 2023 10:25 AM GMT
Next Story