Telugu Global
Telangana

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్రకటించిన కేసీఆర్, 'దేశపతి'కి దక్కిన అవకాశం

మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్రకటించిన కేసీఆర్, దేశపతికి దక్కిన అవకాశం
X

తెలంగాణలో మార్చ్ 23 న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బారత రాష్ట్ర సమితి (BRS)తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రకటించారు.

మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు.

ఈ నెల 9న వీరు ముగ్గురు నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. అందుకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవాలని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

First Published:  7 March 2023 11:20 AM GMT
Next Story