Telugu Global
Telangana

చేవెళ్ల అభ్యర్థిగా కాసాని.. సబితా కుమారుడి ఆసక్తికర ట్వీట్‌

అనూహ్యంగా చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే.. కార్తీక్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

చేవెళ్ల అభ్యర్థిగా కాసాని.. సబితా కుమారుడి ఆసక్తికర ట్వీట్‌
X

చేవెళ్ల లోక్‌సభ స్థానం BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఈ సారి పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. కాసాని వైపు మొగ్గు చూపారు.

అయితే రంజిత్‌ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ సీటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డికి ఇస్తారని అంతా భావించారు. కార్తీక్‌ రెడ్డి సైతం చేవెళ్ల టికెట్ త‌న‌దేన‌ని ధీమాతో ఉన్నారు.

అయితే అనూహ్యంగా చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే.. కార్తీక్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన జీవితమంతా ఏదో తెలియని ఆరాటం.. మిగిలింది పోరాటం.. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.

First Published:  14 March 2024 5:49 AM GMT
Next Story