Telugu Global
Telangana

మోడీ, జన్‌ధన్‌ సొమ్మును అదానీ అకౌంట్ లో వేశారు.... కేటీఆర్‌

గురువారం భూపాలపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు వాగ్దానం చేసిన రూ.15 లక్షలు రాలేదు కానీ అదానీ మాత్రం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారన్నారు. "అదానీకి ఆ డబ్బు రావడానికి మోడీ పూర్తిగా సహాయం చేసారు" అని ఆయన అన్నారు.

మోడీ, జన్‌ధన్‌ సొమ్మును అదానీ అకౌంట్ లో వేశారు.... కేటీఆర్‌
X

Jan Dhan money went to Adani instead of people of India, says KTRప్రధాని నరేంద్ర మోడీ, గౌతమ్‌ అదానీల మధ్య స్నేహబంధాన్ని లక్ష్యం చేసుకుని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. భారత ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చడంలో మోడీ విఫలమయ్యారని, కానీ అందుకు బదులుగా అదానీకి ఆయన సహాయం చేశారని ఆయన ఆరోపించారు..

గురువారం భూపాలపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు వాగ్దానం చేసిన రూ.15 లక్షలు రాలేదు కానీ అదానీ మాత్రం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారన్నారు. "అదానీకి ఆ డబ్బు రావడానికి మోడీ పూర్తిగా సహాయం చేసారు" అని ఆయన అన్నారు.

మోడీ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఎత్తి చూపిన కేటీఆర్, దేశం చూసిన అత్యంత అసమర్థ ప్రధాని మోడీ అని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణపై వివక్ష చూపుతున్న మోడీ సర్కార్‌ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్‌ఎస్‌ నేతలను వేటకుక్కల్లా వేటాడుతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలను మంజూరు చేయకపోగా, కేంద్రం తెలంగాణకు రావాల్సిన నిధుల వాటాను ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందన్నారు.

మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసినా, ఈ పథకాలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు.

నిత్యం పెట్రోలు, ఎల్‌పీజీ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపడానికి మోడీయే కారణమ‌ని, పెట్రోలు ధరలు లీటరుకు రూ.70 నుంచి రూ.110కి పెరిగాయని, ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. మోడీ హయాంలో రూ.400 నుంచి రూ.1200 పెరిగిందని మండిపడ్డారు కేటీఆర్.

''కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణం. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆయన్ను దేవుడని పిలుస్తున్నారు. అతను ఎవరికి దేవుడు అని నేను వారిని అడుగుతున్నాను, ”అని కేటీఆర్ ప్రశ్నించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని మోడీ ఆపారనే బీజేపీ నేతల వాదనలను హేళన చేస్తూ, మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించడంలో కూడా మోడీ విఫలమయ్యారని కేటీఆర్ అన్నారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు, మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఆ ఇద్దరు చేస్తున్న అసత్య ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దని హెచ్చరిస్తూ.. రేవంత్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి రావాలని వేడుకుంటున్నారని, అయితే ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రం చాలా నష్టపోతుందని అన్నారు.

First Published:  23 Feb 2023 2:24 PM GMT
Next Story