Telugu Global
Telangana

ఈ దరిద్రమేంటి..? అంతా రాహుల్ గాంధీకి చెప్తా -జగ్గారెడ్డి

రాష్ట్రంలో పార్టీ ఐక్యంగా ఉందో, లేదో చెప్పలేను.. చెప్పేవాడినీ కానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాకు కొన్ని విషయాలు చెప్పలేనని అన్నారు.

ఈ దరిద్రమేంటి..? అంతా రాహుల్ గాంధీకి చెప్తా -జగ్గారెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్ లో ఈ దరిద్రమేంటి..? ప్రతిరోజూ నాకు శీలపరీక్ష ఏంటి అని మండిపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అధిష్టానం పిలుపుమేరకు ఆయన ఢిల్లీ వచ్చారు, రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. పార్టీ మార్పు వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండించారు. కాంగ్రెస్ లోనే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దరిద్రం ఎప్పుడూ తాను చూడలేదన్నారు.

పార్టీలో తనపై నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు జగ్గారెడ్డి. పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలిచారని.. ఆయనకు అన్ని విషయాలూ వివరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ ఐక్యంగా ఉందో, లేదో చెప్పలేను.. చెప్పేవాడినీ కానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాకు కొన్ని విషయాలు చెప్పలేనని అన్నారు. అయితే అన్ని విషయాలు రాహుల్ గాంధీకి చెబుతానన్నారు. ఏడాదిగా తనలో మార్పు చూసి ఉంటారని, రాహుల్ ఉపదేశం వల్లే తన పంథా మార్చుకున్నానని చెప్పారు జగ్గారెడ్డి.

పిలిస్తేనే వస్తాడు.. అడుక్కోని రాడు..

జగ్గారెడ్డి అనే నాయకుడు పిలిస్తేనే అధిష్టానం దగ్గరకు వస్తాడు కానీ, అడుక్కుని రాడు అని అన్నారు. పరోక్షంగా పార్టీలోని మిగతా నాయకులకు కౌంటర్ ఇచ్చారు. మొత్తమ్మీద జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. ఆయన ఎవరిపై ఆరోపణలు చేస్తారు, రాహుల్ మీటింగ్ తర్వాత కీలక నిర్ణయం ఏదైనా తీసుకుంటారా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

First Published:  27 Jun 2023 7:33 AM GMT
Next Story