Telugu Global
Telangana

చివరి టీ20లో ఆసీస్ పై ఇండియా ఘన విజయం - సిరీస్ భారత్ స్వంతం

ఆస్ట్రేలియా ఇండియా టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ స్వంతం చేసుకుంది.

చివరి టీ20లో ఆసీస్ పై ఇండియా ఘన విజయం - సిరీస్ భారత్ స్వంతం
X

హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన ఆస్ట్రేలియా, ఇ‍ండియా మూడో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2 -1 తేడాతో భారత్ స్వంతం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఓపెనర్ కామరాన్ గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54, డేనియల్ సామ్స్ 28, జోష్ ఇంగ్లిస్ 24 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన‌ టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మాజీ కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ దూకుడు ప్రదర్శించి రన్ రేట్ తగ్గకుండా ఆడారు.

ఆఖర్లో టీమిండియా 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. సామ్స్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన కోహ్లీ, ఆ తర్వాత బంతికే అవుటయ్యాడు. దాంతో 5 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా, దినేశ్ కార్తీక్ బరిలో దిగాడు. ఓ సింగిల్ తీసి పాండ్యాకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఎంతో కూల్ గా ఆడిన పాండ్యా ఓ బాల్ వేస్ట్ చేసినా, మరుసటి బాల్ కే ఫోర్ కొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

First Published:  25 Sep 2022 5:51 PM GMT
Next Story