Telugu Global
Telangana

నేనే సంగారెడ్డి ప్రజలను రిజెక్ట్ చేశా.. ఇక పోటీ చేయను

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలను ఎందుకు ఓట్లడగాలన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని తనకు లేదన్నారు జగ్గారెడ్డి.

నేనే సంగారెడ్డి ప్రజలను రిజెక్ట్ చేశా.. ఇక పోటీ చేయను
X

కాంగ్రెస్ సీనియర్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసన్నారు. ఇదే విషయాన్ని డిసెంబర్‌ 1న రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో ఇకపై పోటీ చేయనని.. రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం కష్టపడతానన్నారు.

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలను ఎందుకు ఓట్లడగాలన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని తనకు లేదన్నారు జగ్గారెడ్డి. పార్టీ ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు.

ఇక జగ్గారెడ్డి పీసీసీ పదవిపై కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఉద్దేశంతోనే పార్టీ కోసం రాష్ట్రమంతా తిరుగుతానంటూ వ్యాఖ్యలు చేశారని సమాచారం. ప్రస్తుతం పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కడంతో నెక్స్ట్ పీసీసీ ఎవరనేది ఆసక్తిగా మారింది.

First Published:  4 Jan 2024 3:21 AM GMT
Next Story