Telugu Global
Telangana

త్వరలో అంతర్జాతీయ ఫార్మా హబ్‌గా హైదరాబాద్ : కేటీఆర్

కేంద్రం కోఆపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా గురించి మాట్లాడుతున్న‌ప్పటికీ, ఆచరణలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తో‍ందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేశారు. ఒకవేళ అనుమతిస్తే తెలంగాణకు ఐటీ రంగంలో మరిన్ని అవకాశాలు లభించేవి అని కేటీఆర్ తెలిపారు.

త్వరలో అంతర్జాతీయ ఫార్మా హబ్‌గా హైదరాబాద్ : కేటీఆర్
X

రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ , అనుబంధ రంగాలలో సుమారు నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారని, ఇది కూడా తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో 8,00,000కి రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు.

మిగతా వాటితో పాటు, జీనోమ్ వ్యాలీకి అదనంగా 20 లక్షల చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ స్థలం యాడ్ అవుతుంది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీ దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి వినియోగిస్తున్నారు. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌ల క్లస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం క్లస్టర్‌లో స్థలం ఖాళీగా లేదని ఆయన అన్నారు.

పరిశ్రమల ఈవెంట్ బయోఏషియా 20వ ఎడిషన్‌కు కర్టెన్ రైజర్‌గా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పెంపొందించే పర్యావరణ వ్యవస్థ, ప్రగతిశీల ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రంలోని ఐటీ, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ రంగాలు అభివృద్ధి చెందాయని అన్నారు.

కేంద్రం కోఆపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా గురించి మాట్లాడుతున్న‌ప్పటికీ, ఆచరణలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తో‍ందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేశారు. ఒకవేళ అనుమతిస్తే తెలంగాణకు ఐటీ రంగంలో మరిన్ని అవకాశాలు లభించేవి అని కేటీఆర్ తెలిపారు.

ఇక్కడ పెద్దఎత్తున సహాయక పర్యావరణ వ్యవస్థ ఉన్నప్పటికీ, బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పట్టించుకోలేదని, యూఎస్‌ రెగ్యులేటర్‌ ఆమోదించిన ఫార్మా యూనిట్లు అనేకం ఉన్నప్పటికీ, కేంద్రం తెలంగాణకు బల్క్‌ డ్రగ్స్‌ తయారీ పార్క్‌ను ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాతాన్ని చూపిందని కేటీఆర్ ఆరోపించారు..

“తెలంగాణ అభివృద్ధి చెందుతూనే ఉంది. మరింత అభివృద్ధి చెందుతుంది. కేంద్రం కూడా సహకరిస్తే వృద్ధి కాస్త వేగంగా జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.

బయోఏషియా కార్యక్రమం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశాలకు ఫార్మా, హెల్త్ , లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు రావడానికి తోడ్పడుతుందన్నారు కేటీఆర్. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24 నుండి 26 వరకు హైదరాబాద్‌లో జరగనుంది.

First Published:  21 Feb 2023 11:47 AM GMT
Next Story