Telugu Global
Telangana

హైదరాబాద్: బంగారు దుకాణంలో దోపిడి - దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగోల్, స్నేహపురి కాలనీలో ఉన్న మహదేవ్ జ్యూవెలర్స్ లోకి కొద్ది సేపటి క్రితం ముగ్గురు వ్యక్తులు వచ్చి షాపులో పని చేస్తున్న వర్కర్స్ పైకి, యజమానికళ్యాణ్ సింగ్ పైకి తుపాకులు గురిపెట్టి బంగారం దోచుకున్నారు.

హైదరాబాద్: బంగారు దుకాణంలో దోపిడి - దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
X

హైదరాబాద్ నాగోల్ లో ఓ బంగారం షాప్ లో దోపిడి జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

నాగోల్, స్నేహపురి కాలనీలో ఉన్న మహదేవ్ జ్యూవెలర్స్ లోకి కొద్ది సేపటి క్రితం ఇద్దరు వ్యక్తులు వచ్చి షాపులో పని చేస్తున్న వర్కర్స్ పైకి, యజమానికళ్యాణ్ చౌదరి పైకి తుపాకులు గురిపెట్టి బంగారం దోచుకున్నారు. ఈ సమయంలో వర్కర్స్ ఎదురు తిరగడంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యజమాని కళ్యాణ్ సింగ్, మరో వర్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కళ్యాణ్ చౌదరి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

దుండగులు షాపు లోపలికి వచ్చాక షటర్ మూసివేయడంతో లోపల జరిగిన సంఘటన బైట ఎవరికీ తెలియలేదు. పైగా అది షాపులు మూసేసే సమయం కావడంతో అక్కడ జనాలు కూడా పెద్దగా లేరు. అయితే దుండగులు పారిపోయిన తర్వాత ఓ వర్కర్ బైటికి వచ్చి చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షాపులోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది

First Published:  1 Dec 2022 4:50 PM GMT
Next Story