Telugu Global
Telangana

సికింద్రాబాద్: ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో భారీ అగ్ని ప్రమాదం ....ఏడుగురి మరణం?

సికిందరాబాద్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. పది మందికి పైగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో బ్యాటరీలు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

సికింద్రాబాద్: ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో భారీ అగ్ని ప్రమాదం ....ఏడుగురి మరణం?
X

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో బ్యాటరీలు పేలిపోవడంతో భారీ ప్రమాదం జరిగింది. భారీగా నిప్పు అంటుకొని ఆ షోరూం పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించడంతో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఇప్పటి వరకు లాడ్జి నుంచి 10 మందిని రక్షించినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఏడుగురు సజీవ దహనమైనట్టు సమాచారం అందుతోంది. సోమవారం రాత్రి ఈ సంఘటన‌ జరిగింది.

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో ఉన్న రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంలో మంటలు చెలరేగాయి. పై అంతస్తులో ఒక లాడ్జ్ లో చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకున్న పలువురు ఊపిరి అందక చనిపోయినట్టు తెలుస్తోంది. .

కొందరు ఆ మంటల‌ నుండి తమను తాము రక్షించుకోవడానికి లాడ్జిపై నుండి కిందికి దూకి గాయాలపాలైనట్టు తెలుస్తోంది. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిచ్చెనలను ఉపయోగించి ఫైర్‌మెన్‌లు పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

First Published:  12 Sep 2022 6:40 PM GMT
Next Story