Telugu Global
Telangana

టీఆర్‌ఎస్ నేత కారు అద్దాలు పగులగొట్టిన అమిత్ షా సెక్యూరిటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ నేత కారు అద్దాలను అమిత్ షా భద్రతా సిబ్బంది పగుల గొట్టారు.

టీఆర్‌ఎస్ నేత కారు అద్దాలు పగులగొట్టిన అమిత్ షా సెక్యూరిటీ
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ నేత కారు అద్దాలను అమిత్ షా భద్రతా సిబ్బంది పగుల గొట్టారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా హరితా ప్లాజా వద్దకు అమిత్ షా కాన్వాయ్ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న మలుపులో టీఆర్‌ఎస్ నేత కారు ఆగిపోయింది. దాని స్టార్ట్ చేసేందుకు శ్రీనివాస్ ప్రయత్నిస్తుండగానే.. అమిత్ షా భద్రతా సిబ్బంది పరుగుపరుగున అక్కడి వచ్చారు.



కారు ఎందుకు అడ్డుగా పెట్టారంటూ ప్రశ్నించారు. స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే కారు వెనుక అద్దాలను భద్రతా సిబ్బంది పగులగొట్టారు. ఆ తర్వాత కారును పక్కకు తోసేశారు. కారు ఆగిపోయిందని..దాన్ని స్టార్ట్‌ చేసే లోపే వచ్చి అద్దాలు పగులగొట్టారని టీఆర్‌ఎస్ నేత చెబుతున్నారు.



ఈ ఘటనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌కు వచ్చిన సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని విమర్శించారు. మొన్న అసోం ముఖ్యమంత్రి వచ్చిన సమయంలోనూ ఇలాగే టీఆర్ఎస్ నేత ఒకరు అడ్డుపడ్డారని విమర్శించారు. అమిత్ షా కాన్వాయ్ వచ్చే దారిలో కారును అడ్డుగా నిలిపిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

First Published:  17 Sep 2022 8:22 AM GMT
Next Story