Telugu Global
Telangana

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్

హీరోయిన్ భర్త మోహిత్ దేశంలో ప్రముఖ డీజేగా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా కూడా అతనికి పేరుంది. ఇతను డీజే పార్టీలు, ఈవెంట్ల ముసుగులో గత 12 ఏళ్ళుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్
X

ఓ టాలీవుడ్ హీరోయిన్ భర్తను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు హైదరాబాదుకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను కూడా అరెస్టు చేశారు.

టాలీవుడ్ లో 'ఐపీసీ సెక్షన్: భార్యాబాధితుడు', 'వాడేనా', ' బిచ్చగాడా మజాకా', ' ధడ పుట్టిస్తా', 'వజ్రాలు కావాలా నాయనా' తదితర మూవీల్లో హీరోయిన్ గా నటించిన నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను, బిజినెస్ మ్యాన్ కృష్ణకిశోర్ రెడ్డిని అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

హీరోయిన్ భర్త మోహిత్ దేశంలో ప్రముఖ డీజేగా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా కూడా అతనికి పేరుంది. ఇతను డీజే పార్టీలు, ఈవెంట్ల ముసుగులో గత 12 ఏళ్ళుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

మోహిత్ ముంబై కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. అతనికి దేశం లోని వివిధ భాషల సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఆయనను హైదరాబాదులోని ఓ పబ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ఇక కృష్ణకిశోర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు చేపడుతున్నాడు. ఎడ్విన్, మోహిత్ ల ద్వారా ఇతను డ్రగ్స్ తెప్పించి పలువురు వ్యాపార వేత్తలకు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

First Published:  2 Jan 2023 12:07 PM GMT
Next Story