Telugu Global
Telangana

ఫలక్‌నుమా బస్ డిపోలో మెట్ల బావి పునరుద్ధరణకు సిద్ధమైన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి

ఫలక్ నుమా ప్యాలెస్ కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన బావిని నిజాం తన వ్యక్తిగత ఈత కొలను గా వాడేవారని తెలుస్తోంది.

ఫలక్‌నుమా బస్ డిపోలో మెట్ల బావి పునరుద్ధరణకు సిద్ధమైన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి
X

హైదరాబాద్‌ నగరంలో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సిద్ధమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి ఫలక్ నూమ బస్ డిపోలో మెట్ల బావి ఉన్న విష‌యం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో గత ఏప్రిల్ 3వ తేదీన స్టెప్ వెల్ పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యంగా ఉన్న కల్పన రమేష్ తో కలిసి హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసి, ఆర్టీసీ అధికారులు డిపో లోపల ఉన్న పురాతన బావిని సందర్శించారు. ఫలక్ నుమా ప్యాలెస్ కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన బావిని నిజాం తన వ్యక్తిగత ఈత కొలను గా వాడేవారని తెలుస్తోంది.

"ఫలక్ నుమా బస్ డిపో మెట్లబావి" పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హెచ్ఎండిఎ, జిహెచ్ఎంసి, సాహి(SAHE) ఎన్జీవో సంస్థ ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. అవగాహన ఒప్పందం కార్యక్రమంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిఐఓ) షేక్ మీరా, జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండివోర్ (SAHE) జాయింట్ సెక్రెటరీ కల్పన రమేష్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్.ఎం. వినయ్ భాను, ఫలక్ నూమా డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, హెచ్ఎండిఏ డీఏవోలు ఎం.బద్రీనాథ్, అరుణ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  11 May 2023 5:19 PM GMT
Next Story