Telugu Global
Telangana

బర్రెలక్కకు సెక్యూరిటీ.. హైకోర్టు ఆదేశం

శిరీష తమ్ముడిపై రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో 2+2 సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

బర్రెలక్కకు సెక్యూరిటీ.. హైకోర్టు ఆదేశం
X

కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, ఆమె హాజరు అయ్యే పబ్లిక్‌ మీటింగ్‌లకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రమే భద్రత ఇస్తే సరిపోదు. తమకు ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థుల సెక్యూరిటీ బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని.. పోలీసులు కేవలం కార్లు చెక్‌ చేస్తాం అంటే కుదరదని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

శిరీష తమ్ముడిపై రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో 2+2 సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శిరీష. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శిరీషకు గన్‌మెన్‌తో సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది.

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు శిరీష. రెండు రోజుల క్రితం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టైమ్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తమ్ముడిపై దాడి చేశారు.

First Published:  24 Nov 2023 11:25 AM GMT
Next Story