Telugu Global
Telangana

టికెట్‌ ఇస్తామన్నారు.. ఇప్పుడెమో చప్పుడు చేయట్లే- గద్దర్ భార్య

కుమార్తె వెన్నెలకు టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చార‌ని, ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారన్నారు. ఆ మాట కూడా ఎత్తడం లేదన్నారు.

టికెట్‌ ఇస్తామన్నారు.. ఇప్పుడెమో చప్పుడు చేయట్లే- గద్దర్ భార్య
X

త‌న తండ్రి ఆశ‌యాన్ని నెర‌వేర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు దివంగత ప్రజాగాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెల. తన అన్న సూర్యం సెన్సిటివ్‌ అని అందుకే అతను ఎన్నికలకు దూరంగా ఉంటారని చెప్పారు. 2023 ఎన్నికల్లో గద్దర్ పోటీ చేయాలనుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వెన్నెల గుర్తు చేశారు. త‌న తండ్రి ఆశ‌యాన్ని తాను భుజానికి ఎత్తుకుంటున్న‌ట్లు చెప్పారు.

కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానన్నారు. తాము పోటీ చేయడానికి సిద్ధంగా లేమని కొంతమంది కావాల‌నే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. పోటీకి తాము రెడీగా ఉన్నామన్నారు వెన్నెల. కాంగ్రెస్ నుంచే పోటీ చేయడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు. తన తండ్రి గద్దర్‌ను కాంగ్రెస్‌ చేరదీసిందని.. అందుకే ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వివ‌రించారు.

అయితే ఈ సందర్భంగా గద్దర్ భార్య విమలా గద్దర్ కాంగ్రెస్‌ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కుమార్తె వెన్నెలకు టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చార‌ని, ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారన్నారు. ఆ మాట కూడా ఎత్తడం లేదన్నారు. వెన్నెలకు టికెట్ ఇస్తే తాను కూడా ఇంటింటికి తిరిగి ఎన్నిక‌ల‌ ప్రచారం చేస్తానన్నారు.

First Published:  21 Oct 2023 12:14 PM GMT
Next Story