Telugu Global
Telangana

టీడీపీకి మ‌రో నేత గుడ్ బై !

బ‌ర్త్ డే సంద‌ర్బంగా కంట‌త‌డి పెట్టుకున్న ద‌యాక‌ర్ రెడ్డి పార్టీ మార్పు అనివార్య‌మ‌ని అనుచ‌రుల‌కు చెప్పారు. కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి దంప‌తులు త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీకి మ‌రో నేత గుడ్ బై !
X

తెలుగుదేశానికి మ‌రో నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ద‌యాక‌ర్ రెడ్డి దంప‌తులు టీడీపీకి రాజీనామా చేశారు. కొత్తకోట ద‌యాక‌ర్‌రెడ్డి దంప‌తులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దేవ‌ర‌కద్ర‌, మ‌క్త‌ల్‌, నారాయ‌ణ‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరికి మంచి ప‌ట్టు ఉంది. మ‌క్త‌ల్‌, దేవ‌ర‌క‌ద్ర నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

2009లో మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు సార్లు ఓడిపోయారు. తెలంగాణ విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ ప‌ని అయిపోయింద‌ని.. ఇక ఆ పార్టీలో ఉంటే గెలిచేది లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. బ‌ర్త్ డే సంద‌ర్బంగా కంట‌త‌డి పెట్టుకున్న ద‌యాక‌ర్ రెడ్డి పార్టీ మార్పు అనివార్య‌మ‌ని అనుచ‌రుల‌కు చెప్పారు.

కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి దంప‌తులు త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక్క‌డ చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుత ఎమ్మెల్యే. ఈయ‌న డీకే అరుణ సోద‌రుడు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు.

కొత్త‌కోట దంప‌తుల చేరిక‌తో దేవ‌ర‌క‌ద్ర‌, మ‌క్త‌ల్‌, నారాయ‌ణ‌పేట‌లో కాంగ్రెస్‌కు మ‌రింత ప‌ట్టు దొరుకుతుంద‌ని రేవంత్ ఆశిస్తున్నారు. త్వ‌ర‌లోనే వీరి పార్టీ మార్పు ఉంటుంద‌ని తెలుస్తోంది.

First Published:  19 Aug 2022 4:27 AM GMT
Next Story