Telugu Global
Telangana

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి..?

తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పేరు మొదట వినిపించినప్పటికీ.. ఆయన మౌనం వహించడంతో పద్మారావు గౌడ్‌ వైపు కేసీఆర్‌ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి..?
X

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థి విషయమై రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్‌ పోటీకి దించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పేరు మొదట వినిపించినప్పటికీ.. ఆయన మౌనం వహించడంతో పద్మారావు గౌడ్‌ వైపు కేసీఆర్‌ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మారావు గౌడ్‌.. 2004లో మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగానూ వ్యవహరించారు.

First Published:  21 March 2024 4:59 AM GMT
Next Story