Telugu Global
Telangana

బీజేపీతో టచ్‌లోకి మాజీ మంత్రి..?

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏ.పీ.జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు డి.కె.అరుణ మాజీ మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో టచ్‌లోకి మాజీ మంత్రి..?
X

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏ.పీ.జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు డి.కె.అరుణ మాజీ మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

ఇక ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎంపీలు, నేతలు బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన వారిలో ఎంపీలు బీ.బీ.పాటిల్, పొతుగంటి రాములుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ఆరూరి రమేష్‌ ఉన్నారు. ఇప్పటికే వీరిలో బీబీ.పాటిల్‌కు జహీరాబాద్, పొతుగంటి రాములు కుమారుడు భరత్‌కు నాగర్‌కర్నూలు, సైదిరెడ్డికి నల్గొండ లోక్‌స‌భ టికెట్లు ఖాయం అయ్యాయి.

First Published:  18 March 2024 4:56 AM GMT
Next Story