Telugu Global
Telangana

లారీ, కారు మధ్యలో ఆటో.. చిన్నారి సహా ముగ్గురి దుర్మరణం

ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు చనిపోయారు. మ‌రో 15 మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

లారీ, కారు మధ్యలో ఆటో.. చిన్నారి సహా ముగ్గురి దుర్మరణం
X

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో ఆటోను వెనుక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్యలో ఇరుక్కుపోయి ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు చనిపోయారు. మ‌రో 15 మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

ప్రమాదంలో సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) అక్కడిక‌క్కడే మృతి చెందారు. సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్‌ రుక్కమ్మ(63), రెండేళ్ల చిన్నారితో పాటు మరోవ్యక్తి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15మంది ఉన్నారు. రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు.

First Published:  5 April 2024 2:43 AM GMT
Next Story