Telugu Global
Telangana

ఉప్పల్ స్టేడియంకు కరెంట్‌ కట్‌.. చెన్నైతో మ్యాచ్‌కు ముందు షాక్‌

స్టేడియం నిర్వహకులు కోటి 60 లక్షలకుపైగా బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

ఉప్పల్ స్టేడియంకు కరెంట్‌ కట్‌.. చెన్నైతో మ్యాచ్‌కు ముందు షాక్‌
X

ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మ‌ధ్య‌ మ్యాచ్‌ జరగనున్న వేళ విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. ఉప్పల్‌ స్టేడియంకు పవర్‌ కట్ చేశారు. ఇవాళ రెండు జట్ల సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పవర్‌ కట్‌ అయింది.

కొన్ని నెలలుగా స్టేడియంకు సంబంధించిన బిల్లు కట్టనందువల్లే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. స్టేడియం నిర్వహకులు కోటి 60 లక్షలకుపైగా బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

పెండింగ్‌ బిల్లులు క్లియర్ చేయాలని గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ HCA నుంచి స్పందన రాలేదని, అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం స్టేడియంలో జనరేటర్ సాయంతో పవర్‌ సప్లై చేస్తున్నట్లు సమాచారం.

First Published:  4 April 2024 4:16 PM GMT
Next Story