Telugu Global
Telangana

కవితకు ఈడీ మరో షాక్‌.. ఆమె భర్తకు నోటీసులు

కవిత భర్తతో పాటు ఆమె పీఆర్వో రాజేష్‌ సహా ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. వీరందరిని సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

కవితకు ఈడీ మరో షాక్‌.. ఆమె భర్తకు నోటీసులు
X

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవితకు మరో షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. ఆమె భర్త అనిల్‌కు నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో పాటు ఆమె పీఆర్వో రాజేష్‌ సహా ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. వీరందరిని సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

కవిత ఇంట్లో సోదాల సందర్భంగా కవిత భర్త అనిల్ వ్యాపారాలపై ఆరా తీసిన ఈడీ అధికారులు..కవితతో పాటు ఆమె భర్త, సిబ్బంది ఫోన్‌లు సీజ్ చేశారు. మరోవైపు లిక్కర్ కేసులో అరెస్టయిన కవితకు రిమాండ్ విధించింది రౌస్‌ ఎవెన్యూ కోర్ట్‌. దాంతో పాటు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని వాదనలు వినిపించిన కవిత తరపు లాయర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది.

ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది కోర్టు. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కూడా కోర్టు అనుమతించింది.

First Published:  16 March 2024 1:44 PM GMT
Next Story