Telugu Global
Telangana

రాజాసింగ్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే.!

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మంగళ్‌హట్‌ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు బుధవారం యాత్ర నిర్వహించారు రాజాసింగ్‌.

రాజాసింగ్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే.!
X

బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై అఫ్జల్ గంజ్‌ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే శ్రీరామనవమి యాత్ర నిర్వహించడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజాసింగ్‌తో పాటు పలువురి పేర్లను FIRలో చేర్చినట్లు స్పష్టం చేశారు పోలీసులు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మంగళ్‌హట్‌ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు బుధవారం యాత్ర నిర్వహించారు రాజాసింగ్‌. ర్యాలీ సెంట్రల్ గౌలిగూడకు చేరుకోగానే రాజాసింగ్‌ అక్కడున్న భారీ జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడితో ఆగకుండా టపాసులు కూడా కాల్చారు. ఇది కాస్త ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైందని FIRలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేతో పాటు అందరిపైనా ఐపీసీ సెక్షన్ 341, సెక్షన్ - 188, సెక్షన్ 171-c కింద కేసు నమోదు చేశారు. ఇక యాత్రలో రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలపైనా ఈసీ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రసంగం చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఈవో వికాస్‌ రాజ్ స్పష్టం చేశారు.

First Published:  19 April 2024 3:42 AM GMT
Next Story