Telugu Global
Telangana

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”సృష్టికర్త, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో చోటు

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది.

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”సృష్టికర్త, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో చోటు
X

భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో చోటు దక్కింది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగ‍ంగా ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినందుకు గాను ఈ రికార్డు దక్కింది.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. సమిష్టి కృషి, సామాజిక స్పృహ‌కు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ ప్రశంసించారు.

లిమ్కాబుక్ ప్రశంస పత్రాన్ని ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ''లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు చోటు లభించడం, ముఖ్యమంత్రి చేతులమీదగా రికార్డు ప్రతిని అందుకోవడం మరింత బాధ్యతను పెంచింది. “లిమ్కాబక్”లో చోటు దక్కడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న. ఆయన‌ కేసిఆర్ గారి స్పూర్తితో విశేష కృషి చేసి ఒక గంటలోనే మూడున్నర లక్షలు మొక్కలు నాటించారు. రామన్న, వారి అనుచరుల కృషి మాటల్లో వర్ణించలేనిది. వారి విశేష కృషి మూలంగానే ఈ రికార్డు సాధ్యమైంది. వారికి, వారి అనుచర బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.'' అన్నారు.

ఈ రికార్డ్ ను ఎమ్మెల్యే జోగురామన్నకు, ఈ నేల పచ్చగా ఉండాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రకృతి ప్రేమికులు సాలుమారద తిమ్మక్క, వనజీవి రామయ్య, జాదవ్ పయాంగ్ తో పాటు.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా కోట్ల మొక్కలు నాటిని ప్రతీ ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు సంతోష్ తెలిపారు.

First Published:  4 April 2023 3:25 PM GMT
Next Story