Telugu Global
Telangana

భట్టి గమ్యం, గమనం లేని నాయకుడు - గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ ఎంపీగా గత నాలుగు సంవత్సరాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం నుండి ఏం సాధించుకొని తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క పని అయిన ఇది చేసిన అని చెప్పే ధైర్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

భట్టి గమ్యం, గమనం లేని నాయకుడు - గుత్తా సుఖేందర్ రెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నేత భట్టి విక్రమార్క గమ్యం, గవమనం లేని నాయకుడు అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం రోజుకు 3 కిలోమీటర్లు భట్టి పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ" భట్టి పాదయాత్రకి ప్రజల నుండి ఎలాంటి స్పందన లేదని. శనివారం నల్గగొండ క్లాక్ టవర్ దగ్గర జరిగిన సభలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నరని తెలిపారు. భట్టి విక్రమార్కవి వట్టి మాటలు మాత్రమేనని, చీఫ్ పబ్లిసిటీ కోసం తన పైనా, మంత్రి జగదీష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

SLBC లో లెవల్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నామని, ఫ్లోరిన్ ప్రాంతాలకు నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టు ను పూర్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి స్టే లు తీసుకొని వచ్చిన దుర్మార్గులు కాంగ్రెస్ నేతలని ఆగ్రహించారు. SLBC ప్రాజెక్టు పూర్తికావొస్తుందని, ఇంకా 9 కిలోమీటర్ల వర్క్ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కండ్లున్న కబోది అయ్యారని .ఆయనకు గతంలో తాను చేసిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఏం కనబడటం లేదన్నారు.

నల్గొండ ఎంపీగా గత నాలుగు సంవత్సరాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం నుండి ఏం సాధించుకొని తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క పని అయిన ఇది చేసిన అని చెప్పే ధైర్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేయలేదని, వీరందరూ తెలంగాణ ద్రోహులని ఆయన అన్నారు.

తమకు ఒక్కడే నాయకుడు- ఒక్కటే ఎజెండా అని కానీ కాంగ్రెస్, బీజేపీలకు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అసమర్థులు కాబట్టి ఢిల్లీ వైపు చూస్తున్నారని, కేసీఆర్ స‌మర్ధుడు కాబట్టి ఢిల్లీనే ఆయన వైపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మిర్యాలగూ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  18 Jun 2023 1:10 PM GMT
Next Story