Telugu Global
Telangana

ఎంపీ స్థానాలకు కో-ఆర్డినేటర్లు.. రేవంత్‌కు ఆ రెండు బాధ్యత..!

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. డిప్యూటీ సీఎం భట్టికి సికింద్రాబాద్‌, హైదరాబాద్ స్థానాల బాధ్యతను అప్పగించింది.

ఎంపీ స్థానాలకు కో-ఆర్డినేటర్లు.. రేవంత్‌కు ఆ రెండు బాధ్యత..!
X

పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ సహా వివిధ రకాల కమిటీలను నియమించిన AICC.. తాజాగా పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. కో-ఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ లీడర్లకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. డిప్యూటీ సీఎం భట్టికి సికింద్రాబాద్‌, హైదరాబాద్ స్థానాల బాధ్యతను అప్పగించింది.

పార్లమెంట్ స్థానాల కో-ఆర్డినేటర్ల జాబితా ఇదే-

రేవంత్ రెడ్డి - మహబూబ్‌నగర్‌, చేవెళ్ల

భట్టి విక్రమార్క - సికింద్రాబాద్, హైదరాబాద్‌

పొంగులేటి - మహబూబబాద్‌, ఖమ్మం

పొన్నం ప్రభాకర్ - కరీంనగర్‌

జీవన్ రెడ్డి - నిజామాబాద్

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - నల్గొండ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - భువనగిరి

జూపల్లి కృష్ణారావు - నాగర్‌కర్నూలు

దామోదర రాజనర్సింహ - మెదక్‌

సుదర్శన్ రెడ్డి - జహీరాబాద్

తుమ్మల నాగేశ్వర రావు - మల్కాజ్‌గిరి

సీతక్క - ఆదిలాబాద్‌

శ్రీధర్‌ బాబు - పెద్దపల్లి

కొండా సురేఖ - వరంగల్‌

ఇక ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది AICC.

First Published:  7 Jan 2024 4:01 PM GMT
Next Story