Telugu Global
Telangana

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

మునుగోడు ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ప్రతి రౌండ్ లోనూ మూడవ స్థానానికి పరిమితమయ్యింది. ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు.

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
X

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఉత్కంట కొనసాగుతున్నాయి. మొదటి నుంచీ టీఆరెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ప్రదర్శిస్తున్నాయి. ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మూత్రం మూడో స్థానానికే పరిమితమవుతోంది. కౌంటింగ్ సరళిని చూసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సడెన్ గా లేచి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు.

ప్రధానంగా మహిళా ఓటర్లు తనకే ఓటేస్తారనే నమ్మకంతో ఉన్న స్రవంతికి ఫలితాలు నిరాశను కలిగించాయి. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు చూసి ఆమె హతాషురాలయ్యింది. తన ఊహకు ఏమాత్రం దగ్గరగా లేని ఫలితాలు చూసి ఆమె కౌంటి‍ంగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్టు సమాచారం

First Published:  6 Nov 2022 4:29 AM GMT
Next Story