Telugu Global
Telangana

గాంధీ భవన్ లో బీ ఫామ్ ల సందడి..

మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పాార్టీ ఈరోజు నుంచి వారికి పార్టీ బీ ఫామ్ లు ఇస్తోంది.

గాంధీ భవన్ లో బీ ఫామ్ ల సందడి..
X

గాంధీ భవన్ లో బీ ఫామ్ ల సందడి..

గాంధీ భవన్ లో బీఫామ్ ల సందడి నెలకొంది. నామినేషన్ల పర్వం మొదలైన రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ బీ ఫామ్ ల పంపిణీ మొదలు పెట్టడం విశేషం. ఈరోజు ఆదివారం నామినేషన్లకు సెలవు, రేపటి నుంచి నామినేషన్లు జోరదుకుంటాయన్న సందర్భంలో.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలకు బీ ఫామ్ లు ఇస్తున్నారు. మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పాార్టీ ఈరోజు నుంచి వారికి పార్టీ బీ ఫామ్ లు ఇస్తోంది.

గాంధీ భవన్ లో AICC కార్యదర్శి విశ్వనాథ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థులకు బీ ఫాంలు పంపిణీ చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేష్ మొదటి బీ ఫాం తీసుకున్నారు. సిర్పూర్ అభ్యర్థి రవి శ్రీనివాస్ బీ ఫాం తీసుకున్నారు. నిర్మల్ అభ్యర్థి శ్రీహరి రావు తరపున ఆయన కుమార్తె బీ ఫాం తీసుకున్నారు. సికింద్రాబాద్ కంట్మోనెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల, బీ ఫాం అందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కాగా.. జాబితాను ఈరోజు విడుదల చేస్తారని అంటున్నారు. ఇందులోనే సీపీఐకి కేటాయించిన ఒక స్థానం కూడా ఉంటుంది. మూడో జాబితా విడుదలైతే కాంగ్రెస్ లో మరిన్ని అలకలు బయటపడే అవకాశముంది.

First Published:  5 Nov 2023 10:20 AM GMT
Next Story