Telugu Global
Telangana

ఇవాళ కేరళకు సీఎం రేవంత్

కేరళ రాజధాని తిరువనంతపురంలోని పుత్తరికండం మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ హాజరుకానున్నారు.

ఇవాళ కేరళకు సీఎం రేవంత్
X

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేరళలో ప‌ర్య‌టించ‌నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇటీవ‌ల‌ ప్రారంభించిన సమరాగ్ని కార్యక్రమం నేటితో ముగియనుంది. ముగింపు సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని పుత్తరికండం మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ హాజరుకానున్నారు. ఫిబ్రవరి 9న కాసర్‌గోడ్‌ జిల్లాలో ఈ కార్యక్రమాన్నిAICC సెక్రటరీ వేణుగోపాల్ ప్రారంభించారు.

మొత్తం కేరళలోని 14 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది. యాత్రలో భాగంగా కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని పినరయి సర్కార్ విధానాలను కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు.

First Published:  29 Feb 2024 6:17 AM GMT
Next Story