Telugu Global
Telangana

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎంపీ అభ్యర్థుల ప్రకటన

గురువారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు పది స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎంపీ అభ్యర్థుల ప్రకటన
X

పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొంటారు. సీఈసీ సభ్యుడి హోదాలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

గురువారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు పది స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు సమాచారం. నల్గొండ, భువనగిరి, ఆదిలాబాద్‌, ఖమ్మం లాంటి కీలక స్థానాలతో పాటు మరో మూడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ ఖరారైన అభ్యర్థులు వీరే!

మహబూబ్‌నగర్‌ - వంశీచంద్‌రెడ్డి

చేవెళ్ల - సునీతా మహేందర్ రెడ్డి

నిజామాబాద్‌ - జీవన్ రెడ్డి

కరీంనగర్‌ - అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి

వరంగల్ - దొమ్మాటి సాంబయ్య

మల్కాజ్‌గిరి - మైనంపల్లి హనుమంతరావు

మెదక్ - నీలం మధు ముదిరాజ్

జహీరాబాద్ - సురేష్‌ షెట్కార్‌

నాగర్‌కర్నూలు - మల్లు రవి

పెద్దపల్లి - గడ్డం వంశీ

First Published:  6 March 2024 11:01 AM GMT
Next Story