Telugu Global
Telangana

పిల్లుల్ని, కుక్కల్ని చంపను.. సింహంతోనే తలపడతా

ఈ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి పేల్చిన మాటల తూటాలు సంచలనంగా మారాయి. పూర్తి ఇంటర్వ్యూ వచ్చాక బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు మొదలయ్యే అవకాశముంది.

పిల్లుల్ని, కుక్కల్ని చంపను.. సింహంతోనే తలపడతా
X

"మై బిల్లీకో నహీ మారూంగా.. మారేతో షేర్ కోహీ మారూంగా.." అంటూ ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంచ్ డైలాగులు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం రేపు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమోని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.


"కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు జరుగుతున్నదాన్ని దానికి ప్రతీకారంగా చెప్పుకోవచ్చా.." అనే ప్రశ్నతో ఈ ఇంటర్వ్యూ మొదలవుతున్నట్టు తెలుస్తోంది. ఆ పని ఇంకా తాను మొదలు పెట్టలేదని, ప్రతీకారం తీర్చుకున్నానని ఎలా చెప్పగలరని బదులిచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సింహం రెస్ట్ తీసుకుందని, బైటకొస్తే కాంగ్రెస్ నేతలు మూడుతుందనే వార్తలు వినపడుతున్నాయని రేవంత్ రెడ్డికి మరో ప్రశ్న ఎదురైంది. దానికి కూడా ఆయన ఘాటుగానే బదులిచ్చారు. తన దగ్గర తుపాకీ రెడీగా ఉందని, సింహం వస్తే ఒక్క తూటాతో దాని సంగతి చూస్తానని అన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా జాతీయ మీడియాకు పూర్తి స్థాయిలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఈ ఇంటర్వ్యూ ప్రోమోతో కలకలం రేగింది. బీఆర్ఎస్ పై ఆయన పేల్చిన మాటల తూటాలు సంచలనంగా మారాయి. పూర్తి ఇంటర్వ్యూ వచ్చాక బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు మొదలయ్యే అవకాశముంది. అంటే మరో రెండురోజులపాటు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంటుందనమాట.

First Published:  12 April 2024 7:54 AM GMT
Next Story