Telugu Global
Telangana

నేడు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్‌

ఈ రోజు సాయంత్రం మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడం కోసం టీఆరెస్ శ్రేణులు కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నేడు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్‌
X

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ రోజు ఆయన అంబేద్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని, పాలకొండ వద్ద నిర్మించిన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో అమలవుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడం కోసం టీఆరెస్ శ్రేణులు కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరో వైపు రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులు, అధికార, ప్రతిపక్ష నేతల విమర్శల నేపథ్యంలో ఈ రోజు జరిగే బ‌హిరంగ సభపై అందరి దృష్టి పడింది. ఆయన ఏం మాట్లాడతారో అనే ఉత్కంట అందరిలో ఉంది.

First Published:  4 Dec 2022 3:27 AM GMT
Next Story