రేపు సీఎం కేసీఆర్ 4జిల్లాల పర్యటన
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
BY Telugu Global22 March 2023 5:11 PM GMT
X
Telugu Global Updated On: 22 March 2023 5:11 PM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి ఇటీవల వడగళ్ల వాన, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన నేపథ్యంలో ఆయన స్వయంగా రైతులను కలిసి వారితో సంభాషించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆయాజిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతారు.
పంట నష్టానికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో నివేదికలను ముందే తెప్పించుకున్నారు. అనేక జిల్లాల్లో వరి,కూరగాయలు చెరకు, జొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి.
Next Story