Telugu Global
Telangana

సాయిచంద్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ..

సాయిచంద్‌ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సాయిచంద్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ..
X

ఇటీవల అకాల మరణం చెందిన సాయిచంద్ కి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సాయిచంద్‌ దశదిన కర్మకు కేసీఆర్‌ హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు.


కుటుంబ సభ్యులకు పరామర్శ..

సాయిచంద్‌ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. సాయిచంద్ అమర్ రహే అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.

కుటుంబానికి ఆర్థిక సాయం..

సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. కోటిన్నర రూపాయలు కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. సాయిచంద్ పిల్లల పేరుమీద వాటిని ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారు. అదే సమయంలో సాయిచంద్ తండ్రి, చెల్లెలకు కూడా ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. సాయిచంద్ భార్య రజినిని రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ గా నియమించారు.

First Published:  9 July 2023 9:42 AM GMT
Next Story