Telugu Global
Telangana

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు..

ఇటీవలే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇదే ఏడాది తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు..
X

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎన్నికల విధి నిర్వహణలో కీలకంగా ఉండే రెవెన్యూ, పోలీస్ అధికారుల బదిలీ ప్రక్రియ మొదలు పెట్టాలని సీఈసీ ఆదేశాలిచ్చింది. జులై 31లోగా బదిలీలు పూర్తి చేయాలని కోరింది.





ఇటీవలే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇదే ఏడాది తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. ఓటరు నమోదు ప్రక్రియకు తుది అవకాశమిచ్చింది. ఇక జులై 31లోగా రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులను బదిలీ చేయాలంటూ చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలిచ్చింది.

సొంత ప్రాంతాలు వద్దు..

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ మొదలు పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో ఇన్‌ స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది. స్థానికంగా అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్‌ తీసుకోవాలని తెలిపింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

First Published:  2 Jun 2023 4:35 PM GMT
Next Story