Telugu Global
Telangana

బైక్ ఢీకొని బ‌స్సు ద‌గ్ధం.. వ్య‌క్తి మృతి - బ‌స్సు ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్ర‌మాదంలో సంప‌త్‌కుమార్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

బైక్ ఢీకొని బ‌స్సు ద‌గ్ధం.. వ్య‌క్తి మృతి  - బ‌స్సు ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం
X

బ‌స్సును బైక్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఒక వ్య‌క్తి మృతి చెంద‌గా.. బైక్‌తో పాటు బ‌స్సు కూడా పూర్తిగా ద‌గ్ధ‌మైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ (26) యూజే ఫార్ములా కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధుల నిమిత్తం బైక్‌పై బ‌య‌లుదేరాడు. కొల్తూరు వద్దకు చేరుకునేస‌రికి ఎదురుగా వ‌స్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బ‌స్సును ఢీకొట్టాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘ‌ట‌న‌లో సంప‌త్‌కుమార్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ప్ర‌మాదంలో బైక్ పెట్రోల్ ట్యాంకు లీక‌వ‌డంతో మంట‌లు చెల‌రేగాయి. అవి వెంట‌నే బస్సును అంటుకుని పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ప్ర‌మాదాన్ని గుర్తించిన ప్ర‌యాణికులు వెంట‌నే బ‌స్సు నుంచి కిందికి దిగిపోవ‌డంతో క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.


First Published:  22 Aug 2023 6:24 AM GMT
Next Story