Telugu Global
Telangana

సిరిసిల్ల విద్యార్థులకు కేటీఆర్ గిఫ్ట్‌

దాదాపు ఐదేళ్ల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇందులో భాగంగా అవసరమున్న వారికి సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు.

సిరిసిల్ల విద్యార్థులకు కేటీఆర్ గిఫ్ట్‌
X

సొంత నియోజకవర్గం సిరిసిల్ల పరిధిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కానుక ఇవ్వాలని నిర్ణయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని దాదాపు 3 వేల మంది విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌తో పాటు ఓ పెన్నుల ప్యాకెట్‌ను అందిస్తానని ప్రకటించారు. ఇది చిన్న ప్రయత్నమైనప్పటికీ.. తనకు తృప్తినిచ్చే విషయమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.


దాదాపు ఐదేళ్ల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇందులో భాగంగా అవసరమున్న వారికి సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు. పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కింద అంబులెన్సులు అందించారు.

విద్యార్థులకు లాప్‌టాప్స్‌, దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అమర్చడం, అనాథాశ్రమాలకు అవసరమైన సామగ్రి, వందలాది మంది దివ్యాంగులకు త్రీ-వీలర్ స్కూటర్స్‌ అందించారు. ఇక అవసరమైన వారికి వైద్య సహాయం, ఉన్నత విద్య చదువుకోవాలనుకుంటున్న పలువురు విద్యార్థులకు ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ కేటీఆర్ కొనసాగిస్తున్నారు.

First Published:  26 Feb 2024 1:06 PM GMT
Next Story