Telugu Global
Telangana

రాజకీయబేహారులు.. కడియం,కేకేలపై కేటీఆర్ ఫైర్‌

ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు.

రాజకీయబేహారులు.. కడియం,కేకేలపై కేటీఆర్ ఫైర్‌
X

కష్టకాలంలో వరుసగా పార్టీని వీడుతున్న నేతలను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. రాజకీయ బేహారులకు ప్రజలే సమాధానం చెప్తారంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు కేటీఆర్.

శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్‌ అని.. ఒక్కడుగా బయల్దేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్‌ది అన్నారు కేటీఆర్.


అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు. ప్రజల ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCRను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

First Published:  29 March 2024 5:15 AM GMT
Next Story