Telugu Global
Telangana

100 రోజుల వైఫల్యం.. బీఆర్ఎస్‌ కొత్త నిరసన

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కల్యాణలక్ష్మీ, దళితబంధు, ఆసరా పెన్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని ఆరోపించారు హరీష్‌ రావు.

100 రోజుల వైఫల్యం.. బీఆర్ఎస్‌ కొత్త నిరసన
X

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లోపు రైతులకు బోనస్ రూ.500 చెల్లించాలని పోస్టు కార్డు ఉద్యమం చేస్తామన్నారు. హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాయాలని రైతులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కల్యాణలక్ష్మీ, దళితబంధు, ఆసరా పెన్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని ఆరోపించారు హరీష్‌ రావు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు.

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు హరీష్‌ రావు. మెడికల్ కాలేజీలు, నవోదయ, నర్సింగ్ కాలేజీల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని మండిప‌డ్డారు.

First Published:  15 April 2024 5:09 AM GMT
Next Story