Telugu Global
Telangana

అమిత్‌షా కాదు, అబద్ధాల బాద్‌షా- ఎమ్మెల్సీ కవిత

ఎయిర్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థను మూసేసిన బీజేపీ ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తుందట. కనీసం నమ్మేటట్టు అయినా ఉందా?. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ.. మళ్లీ తెరిపిస్తా అంటే మనం నమ్మాలా..?

అమిత్‌షా కాదు, అబద్ధాల బాద్‌షా- ఎమ్మెల్సీ కవిత
X

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అమిత్ షా కాకుండా.. అబద్ధాల బాద్‌షాగా పేరు మార్చుకోవాలని సూచించారు. "అమిత్‌షా కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటున్నారు. ఎయిర్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థను మూసేసిన బీజేపీ ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తుందట. కనీసం నమ్మేటట్టు అయినా ఉందా?. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ.. మళ్లీ తెరిపిస్తా అంటే మనం నమ్మాలా..?" అని ప్రశ్నించారు కవిత.

కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు కవిత. ప్రచారం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ అధిష్టానాలపై విరుచుకుపడ్డారు. "ఇవాళ ఢిల్లీ మొత్తం తెలంగాణపై దాడి చేస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. మాది నలుగురితో కూడిన కుటుంబం కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబం. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవి. కానీ, కేసీఆర్ వచ్చాక ఒక్క అల్లర్ల ఘటనైనా జరిగిందా ఆలోచించండి. అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా..?" అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు కవిత.

First Published:  25 Nov 2023 1:23 PM GMT
Next Story