Telugu Global
Telangana

మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు.. కారు దిగి కాంగ్రెస్‌లోకి!

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సంగారెడ్డిలోని ఓ హెటల్‌లో క‌లిశారు.

మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు.. కారు దిగి కాంగ్రెస్‌లోకి!
X

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ దూకుడు పెంచేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల నైరాశ్యంతో కారు పార్టీ నేత‌లు మ‌రింత నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లోకి వెళుతున్నారంటూ ప్ర‌చారం హోరెత్తిపోతోంది. తాజాగా సంగారెడ్డిలో ఓ హోటల్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌ని, వీరు కాంగ్రెస్‌లో చేర‌డానికే ఈ మీటింగ్ అని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఆ ముగ్గురూ ఎవ‌రంటే..

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సంగారెడ్డిలోని ఓ హెటల్‌లో క‌లిశారు. ర‌హ‌స్యంగా జ‌రిగిన ఈ భేటీలో వారు ముగ్గురూ త‌మ జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పు కోవడానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

నిజ‌మైతే మెద‌క్‌లో బీఆర్ఎస్‌కు క్లిష్ట ప‌రిస్థితులు

వీరితోపాటు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతార‌ని గ‌ట్టి టాక్ వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో బీఆర్ఎస్‌కు క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి.

First Published:  20 March 2024 6:09 AM GMT
Next Story