Telugu Global
Telangana

అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి

అంబులెన్స్ నుంచి దిగిన తర్వాత ప్రభాకర్ రెడ్డి వీల్ చైర్ లో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్ కు సమర్పించారు.

అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి
X

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రి నుంచి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అక్టోబర్ 30వ తేదీన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసే రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ముందుగా స్థానికంగా ఉన్న ఓ ఆస్ప‌త్రిలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడి వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ చేశారు. అప్పటినుంచి ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతూ కోలుకుంటున్న ప్రభాకర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేసేందుకు దుబ్బాకకు వచ్చారు.

అంబులెన్స్ నుంచి దిగిన తర్వాత ప్రభాకర్ రెడ్డి వీల్ చైర్ లో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్ కు సమర్పించారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ రాజుపై పలు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం అతడు పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు.

First Published:  9 Nov 2023 9:23 AM GMT
Next Story