Telugu Global
Telangana

మా శవాలే చూస్తారు..పాడి సంచలనం..!

మా జీవితాలు, ప్రాణాలు మీ చేతుల్లోనే పెడుతున్నా. నన్ను దీవించి గెలిపిస్తరా.. లేదంటే మేం ఉరి తీసుకోవాల్నా ఆలోచించండి’ అంటూ ఏమోషనల్ అయ్యారు.

మా శవాలే చూస్తారు..పాడి సంచలనం..!
X

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అభ్యర్థించిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో సంచలనంగా మారింది.

ఇంతకీ కౌశిక్ రెడ్డి ఏమన్నాడంటే..!

3వ‌ తారీఖు ప్రజలంతా ఓట్లేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేకపోతే 4వ తారీఖున అందరూ తన శవయాత్రకు రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. తన భార్య, బిడ్డతో పాటు తనను సాదుకుంటారో చంపుకుంటారో ఆలోచన చేయాలన్నారు. ‘మా జీవితాలు, ప్రాణాలు మీ చేతుల్లోనే పెడుతున్నా. నన్ను దీవించి గెలిపిస్తరా.. లేదంటే మేం ఉరి తీసుకోవాల్నా ఆలోచించండి’ అంటూ ఏమోషనల్ అయ్యారు. ‘మీ దయ, దండం.. మమ్ముల మీరే కాపాడుకోవాలే. లేదంటే మా ముగ్గురి శవాలు చూస్తరు’ అంటూ కామెంట్లు చేశారు.


ప్రస్తుతం బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 60 వేల ఓట్లు సాధించారు. 2021లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

First Published:  28 Nov 2023 9:59 AM GMT
Next Story