సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీ డైరెక్టర్ రవితోపాటు నలుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
BY Telugu Global3 April 2024 3:39 PM GMT
![సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం](https://www.teluguglobal.com/h-upload/2024/04/03/1315792-blast-after-fire-at-factory-in-telanganas-sangareddy-5-feared-dead.webp)
X
Telugu Global Updated On: 3 April 2024 3:57 PM GMT
సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని హత్నూర మండలం చంద్రాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు నలువైపులా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.
డైరెక్టర్ రవి, నలుగురు కార్మికులు మృతి
రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీ డైరెక్టర్ రవితోపాటు నలుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. వీరితో పాటు పలువురికి తీవ్రంగా కాలి గాయాలవడంతో సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమికల్స్ తగలబడుతుండటంతో మంటలు ఓ పట్టాన అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది.
Next Story