Telugu Global
Telangana

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు!

పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో రాడిసన్‌ హోటల్‌పై దాడి చేశారు పోలీసులు.

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు!
X

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో కొందరు యువకులు డ్రగ్స్‌ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. యువకుల వ‌ద్ద పెద్ద మొత్తంలో కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఇక పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో రాడిసన్‌ హోటల్‌పై దాడి చేశారు పోలీసులు. మొత్తం ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురిలో ఒకరు 2009లో శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్‌ కుమారుడు వివేకానంద ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు యువకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

First Published:  26 Feb 2024 5:19 AM GMT
Next Story