Telugu Global
Telangana

రేవంత్‌కంటే కేసీఆర్ చాలా బెటర్- ధర్మపురి అర్వింద్

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో పెట్టడమే అన్నారు ధర్మపురి అర్వింద్. తెలంగాణను హోల్‌సేల్‌గా రేవంత్‌రెడ్డి అమ్మేస్తాడు.

రేవంత్‌కంటే కేసీఆర్ చాలా బెటర్- ధర్మపురి అర్వింద్
X

సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. రేవంత్‌రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ చాలా మేలన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. "కేసీఆర్‌ తెలంగాణ కోసం ద‌శాబ్ద‌కాలం పాటు పోరాడారు.

కేసీఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడిన టైమ్‌లో రేవంత్ ఎక్కడున్నాడు..? అప్పుడు రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఏది చెబితే.. రేవంత్ అదే చేస్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లంతా చంద్రబాబు మనుషులే అని విమర్శించారు అర్వింద్.

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో పెట్టడమే అన్నారు ధర్మపురి అర్వింద్. "తెలంగాణను హోల్‌సేల్‌గా రేవంత్‌రెడ్డి అమ్మేస్తాడు. గతంలో బాబుకోసం సంచులు మోసుకెళ్లింది మనం చూడలేదా అన్నారు. మొత్తానికి అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్‌.. రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ చాలా బెటర్‌ అనడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  25 Nov 2023 12:32 PM GMT
Next Story