Telugu Global
Telangana

ఆ బీజేపీ నాయకుడు కనపడుటలేదు, పట్టిస్తే 15 లక్షలు... హైదరాబాద్ లో పోస్టర్లు

''ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు కనపడుట లేదు.. పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం'' అని బీఎల్ సంతోష్ ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఆ బీజేపీ నాయకుడు కనపడుటలేదు, పట్టిస్తే 15 లక్షలు... హైదరాబాద్ లో పోస్టర్లు
X

బీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో అనుమానితుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ పై హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇవి ఎవరు వేశారనేది తెలియరాలేదు.

''ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు కనపడుట లేదు.. పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం'' అని బీఎల్ సంతోష్ ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు బీఆరెస్ శ్రేణులే వేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, బీఏల్ సంతోష్ ఆదేశాల మేరకే బీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో విచారణజరుపుతున్న సిట్ బీల్ సంతోష్ ను విచారణకు రావాలని నోటీసులిచ్చినప్పటికీ ఆయన‌ హాజరుకాలేదు.

అయితే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించగా కోర్టు బీజెపికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. తాము చెప్పేంత వరకు సీబీఐ ఈ కేసును విచారించడానికి వీలులేదని సుప్రీం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

First Published:  16 March 2023 6:31 AM GMT
Next Story