Telugu Global
Telangana

బీజేపీ గురి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వీరే!

టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీజేపీ గురి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వీరే!
X

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం చేసిన నేపథ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేయబోతోందన్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ దిశగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆపరేషన్‌ను దెబ్బకొట్టిన టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివిధ వ్యాపారాల్లో ఉన్న నేతలను టార్గెట్‌గా చేసుకుని ఈడీ, ఐటీ శాఖలను ప్రయోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కొందరు టీఆర్‌ఎస్ నేతల పేర్లను ఇప్పటికే బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అలా ప్రచారంలోకి వచ్చిన పేర్లలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్.. ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

వీరిపై ఈడీ, ఐటీలను ప్రయోగించి టీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయబోతోందని గుర్తించిన టీఆర్‌ఎస్ నేతలు ఆ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

First Published:  15 Nov 2022 5:11 AM GMT
Next Story