Telugu Global
Telangana

పెండింగ్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారు..!

పెండింగ్ స్థానాల్లో పెద్దపల్లి, సంగారెడ్డి, కంటోన్మెంట్, మల్కాజిగిరి, నాంపల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లి స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది.

పెండింగ్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారు..!
X

నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది బీజేపీ. ఇప్పటివరకూ నాలుగు విడతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. దీంతో జనసేన తనకు కేటాయించిన 8 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించి, బీ-ఫామ్‌లు సైతం అందించింది. దీంతో రెండు పార్టీలు కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు 108 స్థానాలు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

ఇక తాజా లిస్ట్‌లో మిగిలిన 11 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన బీజేపీ.. అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి చెప్తోంది. పెండింగ్ స్థానాల్లో పెద్దపల్లి, సంగారెడ్డి, కంటోన్మెంట్, మల్కాజిగిరి, నాంపల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లి స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది. రాత్రికి మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు పార్టీ నుంచి నామినేషన్ దాఖ‌లు చేయాల‌ని ఫోన్ ద్వారా ఆదేశాలందుకున్న వారి జాబితా ఇదే.!

కంటోన్మెంట్-కృష్ణ ప్రసాద్

నాంపల్లి- రాహుల్ చంద్ర

శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్

మల్కాజిగిరి-రామచందర్రావు

పెద్దపల్లి-ప్రదీప్ కుమార్

మేడ్చల్- విక్రమ్ రెడ్డి

First Published:  9 Nov 2023 3:29 PM GMT
Next Story