Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో నిందితులకు బెయిల్ మంజూరు

ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని, ముగ్గురి పాస్ పోర్టులను పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని, సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించిన కోర్టు ముగ్గురూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో నిందితులకు బెయిల్ మంజూరు
X

టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని, ముగ్గురి పాస్ పోర్టులను పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని, సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించిన కోర్టు ముగ్గురూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది.

కాగా వీరు బెయిల్ పై రిలీజ్ అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ లాయర్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు.

అయితే ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చినప్పటికీ సింహయాజీ మాత్రమే విడుదలవుతారు. మిగతా ఇద్దరు రామచంద్ర భారతి, నందకుమార్ లపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఇతర కేసులు ఉండటం వల్ల ఆ కేసుల్లో కూడా వారిద్దరికీ బెయిల్ వస్తేనే వారు జైలు నుండి విడుదలవుతారు.

First Published:  1 Dec 2022 7:24 AM GMT
Next Story